![]() |
![]() |

శోభా శెట్టి సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వైరల్ గా మారింది. ఐతే ఎందుకు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుందో మాత్రం రీజన్స్ చెప్పలేదు. ఇక నెటిజన్స్ ఐతే ఆమె బ్రేక్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. "ఎం జరిగిందో తెలీదు కానీ చాలా స్ట్రాంగ్ గా అయ్యి తిరిగి రండి...ఏమయ్యింది అక్క. ఇదేమన్నా ప్రాంక్ మెసేజా...హ్యాపీ జర్నీ" అంటూ మెసేజెస్ చేస్తున్నారు.
.webp)
ఐతే ఇంతకు పర్సనల్ రీజన్స్ కారణంగా వెళ్ళిపోతోందా లేదంటే ఇంకా ఇంకేమైనా కన్నడ నుంచి బెటర్ ఆఫర్ లు వచ్చాయా లేదంటే బిగ్ స్క్రీన్ మీద ట్రై చేయడానికి బ్రేక్ తీసుకుంటోందా లేదా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని పెళ్లి చేసుకుని తిరిగి వస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇండస్ట్రీలో ఉంటుంది కానీ లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు అంతేనా ? అంటూ కూడా నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. శోభా శెట్టికి కార్తీక దీపం సీరియల్ మంచి బ్రేక్ ఇచ్చింది. కానీ తర్వాత అలాంటి సీరియల్స్ ఇంకా ఏమీ రాలేదు. ఈమధ్య కొన్ని షోస్ లో కనిపిస్తోంది..అలాగే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. కానీ ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ వచ్చినట్టు ఏమీ కనిపించడం లేదు. కనడ బిగ్ బాస్ కి వెళ్లి మధ్యలోనే వెళ్ళొచ్చేసింది. కార్తీక దీపం సీరియల్ సెకండ్ హీరోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది కానీ ఇంకా పెళ్లిని పెండింగ్ లో పెట్టింది. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చాక కాబోయే వాడితో కలిసి కొత్త ఇల్లు కొనుక్కుంది. మరి ఏమయ్యిందో ఇంత సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పడం ఏంటో తెలీడం అంటూ ఫాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.
![]() |
![]() |